April 15, 2026

హైదరాబాద్‌లో బ్యాంక్‌ మేనేజర్ మోసం.. యాక్సిస్ బ్యాంక్‌లో NRI ఖాతా నుంచి రూ.7 కోట్ల దోపిడీ – బ్రాంచ్ మేనేజర్

హైదరాబాద్‌లో బ్యాంక్‌ మేనేజర్ మోసం.. యాక్సిస్ బ్యాంక్‌లో NRI ఖాతా నుంచి రూ.7 కోట్ల దోపిడీ – బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్

*హైదరాబాద్‌లో బ్యాంక్‌ మేనేజర్ మోసం.. యాక్సిస్ బ్యాంక్‌లో NRI ఖాతా నుంచి రూ.7 కోట్ల దోపిడీ – బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్*

బేగంపేట Axis Bank బ్రాంచ్‌లో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అదే బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకట రమణ, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు (NRI) ఖాతాదారుడి ఖాతా నుంచి దాదాపు రూ.7 కోట్లను కాజేసిన ఘటన సంచలనం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, విదేశాల్లో ఉన్న బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి, దాదాపు 41 విడతల్లో నగదు బదిలీలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఒక్కరితో మాత్రమే కాకుండా, అదే బ్యాంకులో పనిచేస్తున్న ఇంకా ఇద్దరు ఉద్యోగులు సహకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.

ఈ ఘటనను బాధితుడు 2024 సంవత్సరంలోనే గుర్తించినట్లు సమాచారం. తన ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు మాయమైనట్లు గుర్తించి వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లోనే మేనేజర్ వెంకట రమణకు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు వెల్లడైంది.

దీంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు నిందితుడు వెంకట రమణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఈ కేసులో మిగతా ఇద్దరు ఉద్యోగుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతా లోపాలపై, ముఖ్యంగా NRI ఖాతాల పర్యవేక్షణపై తీవ్ర చర్చ మొదలైంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలపై మరింత కఠిన నియంత్రణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

SUNCHU SURESH

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION